
*®️అక్రమ బియ్యం రవాణాపై కాకినాడ పోర్టులో ఉపముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్గా కళ్యాణ్రు , పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ.*
*పశ్చిమ ఆఫ్రికా దేశాలకు అక్రమంగా బియ్యం తరలించేందుకు సిద్ధంగా ఉన్న బార్జ్ లో 1064 టన్నుల బియ్యం సంచులను స్వయంగా పరిశీలించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు.*
*ఇటీవల పౌరసరఫరాల సంస్థ చైర్మన్ శ్రీ తోట సుధీర్ గారి ఆధ్వర్యంలో అక్రమ బియ్యం తరలింపును అడ్డుకొని పోర్టులోనే ఉంచిన అధికారులు.*
*రెండు రోజుల క్రితం కాకినాడ జిల్లా కలెక్టర్ శ్రీ షణ్మోహన్ గారి ఆధ్వర్యంలో సముద్రం లోపల సుమారు 9 నాటికల్ మైళ్ళ దూరంలో రవాణా కు సిద్ధమై వెళుతున్న స్టెల్లా ఎల్ పనామా షిప్ లో పట్టుబడిన 640 టన్నుల బియ్యం స్వయంగా వెళ్లి చూసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు.*
*కాకినాడ పోర్ట్ నుంచి ఇంత భారీగా బియ్యం రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారని అధికారులపై మండిపాటు.*
**ప్రతిసారి ప్రజాప్రతినిధులు నాయకులు వచ్చి బియ్యం అక్రమ రవాణా ఆపితే గాని ఆపలేరా అంటూ ఆగ్రహం.*
**బియ్యం అక్రమ రవాణాలో ఎవరు ఉన్నా, రేషన్ బియ్యం ఇష్టానుసారం బయటకు తరలిస్తున్న వారు ఎంత వారైనా చర్యలు తీసుకోవాలని ఆదేశించిన పవన్ కళ్యాణ్ గారు.*
Be the first to comment