
కుటుంబ సర్వేను బహిష్కరించిన గ్రామస్తులు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వెంకట్రావుపల్లె గ్రామస్తులు ఇంటింటి కుటుంబ సర్వేను బహిష్కరించారు.
ఇటీవల ఈ గ్రామ సరిహద్దులు మార్చుతూ గెజిట్ వచ్చింది.. అయితే గ్రామస్తులు దానిని వ్యతిరేకిస్తూ నెల క్రితం ఎంపీడీవో, తహసీల్దార్లకు వినతిపత్రాలు ఇచ్చారు.
అయినా స్పందన రాకపోవడంతో.. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు దూరంగా ఉన్నారు.
ఆర్డీవో వెంకట ఉపేందర్ రెడ్డి గ్రామస్తులతో మాట్లాడారు.. కానీ సరిహద్దును రీసర్వే చేశాకే సర్వేకు సహకరి స్తామని గ్రామస్తులు స్పష్టం చేశారు…
Be the first to comment