
నేడు పోలీసుల విచారణకు పుష్పరాజ్
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో విచారణకు రావాల్సిందిగా చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్కు సోమవారం సాయంత్రం నోటీసులు పంపారు. మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.
పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రి లో చికిత్స పొందుతున్నా డు. ఈ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.
మరోవైపు ఈ కేసులో అల్లు అర్జున్కు హైకోర్టు మధ్యం తర బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కి సలాట జరిగింది. సంధ్య థియేటర్లో బెనిఫిట్ షో ఏర్పాటు చేయగా. అల్లు అర్జున్ అభిమానులు పోటెత్తారు.
ఈ క్రమంలోనే సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ చని పోగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో మృత్యు వుతో పోరాడుతున్నారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ను ఏ11గా పేర్కొన్నారు. అనంతరం ఇటీవలే అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. ఓ రాత్రి పాటు చంచల్ గూడ జైలులో ఉంచారు. అయితే తెలం గాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ విడుదలై ఇంటికి చేరుకున్నారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటన చేయడం.. పోలీసులు చెప్పినా కూడా అల్లు అర్జున్ థియేటర్ నుంచి వెళ్లేందుకు ఇష్టపడలేదంటూ రేవంత్ రెడ్డి చెప్పడంతో హీట్ మరింత పెరిగింది.
అయితే అదే రోజు సాయం త్రం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసిన అల్లు అర్జున్.. తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నా రంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై దుమారం కొనసాగుతున్న వేళ.. పోలీసులు ఆ రోజు సంధ్య థియేటర్ వద్ద ఏం జరిగిం దనే దానిపై వీడియోలు కూడా విడుదల చేశారు.
ఈ క్రమంలోనే మంగళ వారం విచారణకు రావా లంటూ అల్లు అర్జున్కు పోలీసులు నోటీసులు పంపారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఏం జరుగు తుందనేదీ ఆసక్తికరంగా మారింది.
Be the first to comment