తెలగ అభ్యుదయ సంఘం వారు ఆధ్వర్యం లో కార్తీకమాస వనసమారాధన కార్యక్రమం

తెలగ అభ్యుదయ సంఘం వారు ఆధ్వర్యం లో కార్తీకమాస వనసమారాధన కార్యక్రమం

కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం పెద్దాపురం టౌన్ లో తెలగ అభ్యుదయ సంఘం వారు ఆధ్వర్యం లో కార్తీకమాస వనసమారాధన కార్యక్రమం అట్టహసం గా నిర్వహించారు. ఈ కార్యక్రమం కి పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చిన్నరాజప్ప తో కలిసి పాల్గొన్న జగ్గంపేట జనసేన ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్. ఈ కార్యక్రమం కి అతిధి గా హాజరైనా కాప్స్ రాక్స్ ఫౌండర్ పెద్దిరెడ్డి శివ భాస్కర్.ఈ సందర్బంగా చిన్నరాజప్ప మాట్లాడుతూ చాలా కాలం నుండి ఆగిపోయిన కాపు కల్యాణ మండపం కి ప్రభుత్వం నుండి 50లక్షలు మంజూరు చేయిస్తాను అని అన్నారు.తుమ్మపల్లి రమేష్ మాట్లాడుతూ కాపు లు అందరూ ఐకమత్యం గా ఉండాలి అని, కాపులు అందరూ కలిసి వనసమారాధన కార్యక్రమం లో పాల్గొనడం చాలా ఆనందం గా ఉంది అన్నారు,పెద్దపురం లో ఆగిపోయిన కాపు కల్యాణ మండపం కి చిన్నరాజప్ప గారు 50లక్షలు ప్రభుత్వం నుండి మంజూరు చేయిస్తారు అని అలాగె ఇంకా కావాల్సిన 30లక్షల ఫండ్ ని ఎంపీ లాడ్స్ నుండి వచ్చేలా తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారిని కోరి వెంటనే మంజూరు చేయించడానికి కృషిచ్చేస్తా అని అన్నారు. ఈ కార్యక్రమం కి తోట సుబ్బారావు నాయుడు,తోట రాంజీ, మెడిబోయిన శ్రీను, మాదారపు వీరబాబు, గోకేడ ప్రసాద్, పాలెం బాబీ, అంకం ఓం ఇతరులు పాల్గొన్నారు

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*