
మళ్ళీ మరో ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్
మధ్యాహ్న భోజనం తిని ముగ్గురు విద్యార్థులకు వాంతులు.. 20 మందికి కడుపునొప్పి
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూర్గుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని, ముగ్గురు విద్యార్థులు వాంతులు చేసుకోగా, 20 మంది కడుపునొప్పితో బాధపడ్డారు.
విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు ప్రభుత్వ వైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వగా, వారు పాఠశాల దగ్గరికి వచ్చి పిల్లలకు మాత్రలు ఇచ్చారు.
కాగా మధ్యాహ్న భోజనానికి వండిన బియ్యం కొత్తవి కావడంతో పాటు అన్నం మెత్తగా కావడం వల్ల విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారని ఎంఈవో వివరించారు..
Be the first to comment