ముగిసిన టీటీడీ పాలకమండలి సమావేశం

తిరుమల

ముగిసిన టీటీడీ పాలకమండలి సమావేశం

చైర్మన్ బీఆర్ నాయుడు మీడియా సమావేశం

సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాం

ఆర్టిఫిషల్ ఇంటిలిజెంట్ సహాయంతో సామాన్య భక్తులు మూడు గంటల్లో దర్శన భాగ్యం

అన్యమత ఉద్యోగస్తులతో మాట్లాడుతాం

విఆర్ఎస్ తీసుకుంటే విఆర్ఎస్ ఇస్తాం…. లేకుంటే ఇతర శాఖలకు బదిలీ చేస్తాం

శ్రీనివాస సేతు కు గరుడ వారధిగా పేరు మార్పు

20 ఎకరాల్లో దేవలోక్ ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది….

ఆ స్థలంలో ఇప్పుడు ముంతాజ్ హోటల్ కన్స్ట్రక్షన్ చేపట్టారు

ఆ ప్రభుత్వ స్థలాన్ని టీటీడీకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరనున్న

తిరుమలలో రాజకీయాలు ప్రసంగాలు నిషేధం, మాట్లాడితే కేసులు పెట్టే విధంగా చర్యలు

స్థానికులకు దర్శన భాగ్యం కల్పన…. ప్రతి నెల మొదటి మంగళవారం దర్శన భాగ్యం కల్పిస్తాం

శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేసి…. వేరొక ట్రస్ట్ లో విలీనం చేస్తాం

ప్రైవేట్ బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లను గవర్నమెంట్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసే విధంగా చర్యలు

నిత్య అన్నదానంను మరింత మెరుగుపరిచేలా చర్యలు… మెనూ లో మరిన్ని ఆహార పదార్థాలు అందుబాటులో తీసుకొస్తాం

టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానం ఇవ్వాలని నిర్ణయం

శారదాపీఠంకు ఇచ్చిన స్థలాన్ని పూర్తిగా రద్దు చేసి… టీటీడీ స్వాధీనం చేసుకుంటుంది

శాశ్వత ఉద్యోగులకు 17,400…. కాంట్రాక్టు ఉద్యోగులకు 7530 బ్రహ్మోత్సవ బహుమానం

టూరిజం టికెట్లు పూర్తిగా రద్దు…. ఇందులో భారీ స్థాయిలో అవకతవకలు జరిగినట్లు సమాచారం

-బిఆర్ నాయుడు, టీటీడీ పాలకమండలి చైర్మన్

అన్నదానం కేంద్రంలో 2 లక్షల మంది కి అన్నప్రసాదం వితరణ

అన్నప్రసాద కేంద్రంలో నూతన పరికరాలు అమర్చి…. ఆధునీకరణకు టీవీఎస్ కు ఇచ్చేందుకు నిర్ణయం

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా ఎలా చేయాలనే దానిపై అధ్యయనం చేస్తున్నాం

సామాన్య భక్తులకు త్వరిత గతిన శ్రీవారి దర్శనభాగ్యం కల్పించే విధంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకురానున్నాం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వర్ట్యువల్ క్యూ ఏర్పాటు చేస్తాం

-శ్యామల రావు, టీటీడీ ఈవో

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*