
పాడె మోసిన చంద్రబాబు.. డప్పు కొట్టిన మందకృష్ణ మాదిగ
AP: సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు ముగిశాయి.
నారావారిపల్లెలో అధికార లాంఛనాలతో ఆయన
అంత్యక్రియలు జరిపారు. పెద్ద కొడుకు నారా రోహిత్
దహన సంస్కారాలు నిర్వహించారు. తమ్ముడి పాడెను చంద్రబాబు మోశారు. అలాగే ఎమ్మార్పీస్ అధ్యక్షుడు
మంద కృష్ణ మాదిగ డప్పు కొట్టారు. అంత్యక్రియల్లో
పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు..
Be the first to comment