నగరంలో దారుణం.. భార్యను గొంతు కోసి తగలబెట్టిన భర్త..

చిన్న పాటి గొడవలకు సహనం కోల్పోయిన భర్త.. భార్యపై కత్తితో దాడి చేసి తగలబెట్టిన ఘటన హైదరాబాద్ లో సంచలనంగా మారింది. నగరంలోని బండ్లగూడలో భార్యాభర్తలు ఫైజ్ ఖురేషి, ఖమర్ బేగం నివాసం ఉంటున్నారు. వీరిద్దరికి వివాహయై ఆరు సంవత్సరాలైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భర్త ఫైజ్ ఖురేషి నగరంలో ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. కొద్దిరోజులు సాఫీగా సాగిన వీరి జీవితంలో మనస్పర్థలు మొదలయ్యాయి. రోజూ ఏదో గొడవ జరుగుతుండటంతో భర్త ఖురేషి భార్య ఖమర్ పై ద్వేషం పెంచుకున్నాడు. ఎలాగైనా భార్యను చంపాలని ప్లాన్ వేసుకున్నాడు. తనతో పాటు కత్తిని కూడా తెచ్చుకున్నాడు. సోమవారం అర్థరాత్రి చిన్న పాటి గొడవ మళ్లీ మొదలైంది. దీంతో అనుకున్న విధంగా తనతో పాటు తెచ్చుకున్న కత్తితో భార్యపై దాడి చేశాడు. అనంతరం అతి కిరాతకంగా గొంతుకోసం దారుణంగా హత్య చేశాడు. ఆమె మృతి చెందిన అనంతరం మృతదేహాన్ని తగలబెట్టి అగ్ని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. చుట్టుపక్కల వాళ్ళు రావడంతో.. భయాందోళన చెందిన భర్త నేరుగా పోలీస్ స్టేషన్ వెళ్ళి లొంగిపోయాడు. ఖురేషిపై కేసు నమోదు చేసి, భార్య మృత దేహాన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే వీరిద్దరి గొడవ జరగుతున్నప్పుడు ఇద్దరు పిల్లలు ఎక్కడ వున్నారు.. అనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఖమర్ మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*