న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తాను అంటున్న జనసేన కనపర్తి మనోజ్ కుమార్

పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మరియు హోంమినిస్టర్ అనిత గారిని కలిసిన జనసేన కనపర్తి మనోజ్ కుమార్

న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తాను అంటున్న జనసేన కనపర్తి మనోజ్ కుమార్

సన్నేబోయిన మైధిలి మరియు తన్నీరు కొండలరావు కుటుంబ సభ్యులకు అండగా జనసేన కనపర్తి మనోజ్ కుమార్

ఈరోజు మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయం మరియు TDP పార్టీ కార్యాలయాలకు బాధితులకు అండగా వారికి న్యాయం కోసం కొండపి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ వెళ్లారు.

నెల్లూరు జిల్లా కావలి రూరల్ పోలీస్ స్టేషన్ లో నమోదైన పొన్నలూరు మండలం చెరుకూరు గ్రామానికి చెందిన మైనర్ విద్యార్థిని మైధిలి కేసులో వాస్తవాలను విచారణ జరిపి సెక్షన్స్ ను ఆల్టర్ చేయడం, లేదా ఇదే కేసును ప్రకాశం జిల్లా ఒంగోలు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఒకే అంశానికి సంబంధించిన రెండు FIR లకు కలిపి ఐ.ఓ ని నియమించి విచారణ జరిపించి చట్టరీత్య చర్యలు తీసుకోవాలని కోరుతూ, అదేవిధంగా పొన్నలూరు మండలం పెద్దవెంకన్నపాలెం గ్రామానికి చెందిన తన్నీరు కొండలరావు చనిపోవడానికి ప్రధాన కారణమైన తన్నీరు అశ్విని, తన్నీరు వెంకట్రావు, కుంచాల శ్రీను మరియు కుంచాల జ్యోతి లపై చట్టమైన చర్యలు తీసుకోవాలని కేసు నమోదు చేయాలని జనసేన పార్టీ జనవాణి కార్యక్రమం ద్వారా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హోం మినిస్టర్ శ్రీమతి వంగలపూడి అనిత గారిని కూడా న్యాయం కోసం కలిసి రెండు కేసులకు సంబంధించి వివరించడం జరిగింది అని జనసేన పార్టీ కొండపి నియోజకవర్గం సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ తెలియజేశారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*