మినీ గో కులాలు నిర్మించిన రైతులకు బిల్లులు చెల్లించని కూటమి ప్రభుత్వం

ఉపాధి హామీ నిదులతో రాష్ట్రంలో ఎంతోమంది రైతులు మినీ గోకులాలు నిర్మించారు అందులో భాగంగా మా గ్రామంలో 12 మినీ గోకులాలు నిర్మాణం చేశారు
జనవరి నెల తర్వాత ఒకరికి కూడా కనీసం ఒక రూపాయి బిల్లు వేయలేదు ఇప్పుడు వాళ్లు కట్టి సుమారుగా 6,7 నెలలు అవుతుంది లబ్ధిదారులకు వడ్డీలకు కూడా రావు ఇది కరెక్ట్ కాదు సిసి రోడ్లు కోట్ల రూపాయల ఖర్చుపెట్టి వేసినప్పటికీ వాళ్లకి కూడా బిల్లులు వేయకపోవడం చాలా దుర్మార్గం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వీటిపై దృష్టి పెట్టి ఆ బిల్లులు వేస్తే కొత్తగా పనులను ప్రారంభించడానికి ఆసక్తి చూపుతారు అని కోరుతున్నాను
గ్రామాల్లో తిరగలేకపోతున్నాం కనీసం ఉపాధి హామీ వేతన దారులకు కూడా పేమెంట్ చేసే పరిస్థితి లేదు ఇలాగే కొనసాగితే మన కూటమి ప్రభుత్వoపై ప్రజలు తిరుగుబాటు చేయక తప్పరు
గ్రామాల్లో తిగలేకపోతున్నాము
అసలు పార్టీ కోసం పనిచేసే నాలాంటి సామాన్య జనసేన కార్యకర్తలు అస్సలు
మా మొహాలు కూడా చూపించలేకపోతున్నాము
ఈ విషయాన్ని కూటమి పెద్దలు
గౌరవ ముఖ్యమంత్రి గారికి
గౌ:ఉప ముఖ్యమంత్రి గారికి తెలియజేయవలసినదిగా కోరుతున్నాం
ఇట్లు మీ బాబురావు గార జనసేన పార్టీ కార్యనిర్వహణ కమిటీ సభ్యులు
శ్రీకాకుళం జిల్లా

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*