
కేరళలో అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా
కేరళలో విషాదం చోటు చేసుకుంది. కొట్టాయంలో అయ్యప్ప స్వాములతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో 29 మందికి గాయాలయ్యాయి. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కొట్టాయం ఆసుపత్రికి తరలించారు. వీరంతా హైదరాబాద్, మాదన్నపేట్, ఉప్పర్దూడ ప్రాంతానికి చెందిన అయ్యప్ప స్వాములు శబరిమల దర్శనానికి వెళ్తున్నట్లు గుర్తించారు.
Be the first to comment