భారత సరిహద్దుల్లో చైనా ఘర్షణ పెంచే చర్యలకు పాల్పడుతోంది

భారత సరిహద్దుల్లో చైనా ఘర్షణ పెంచే చర్యలకు పాల్పడుతోంది

భారత సరిహద్దుల్లో చైనా ఘర్షణ పెంచే చర్యలకు పాల్పడుతోంది. డోక్లాం సమీపంలో జోరుగా ఊళ్లకు ఊళ్లు నిర్మిస్తూ కవ్విస్తోంది. గత ఎనిమిదేళ్ల నుంచి చూస్తే ఇప్పటి వరకు ఆ వ్యూహాత్మక సరిహద్దు ప్రాంతానికి సమీపంలో 22 గ్రామాలు, జనావాసాలను ఏర్పాటు చేసింది. 2020 నుంచి ఇప్పటి వరకు అక్కడ 8 గ్రామాలు నిర్మించినట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోంది. ఈ గ్రామాలను డోక్లాం సమీపంలో భూటాన్‌ భూభాగంలోని పశ్చిమ ప్రాంతంలో కడుతున్న చైనా.. ఆ భూమి తమదేనంటూ చెప్పుకుంటోంది. ఈ గ్రామాలు భూటాన్‌ పశ్చిమ భాగంలోనే ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు. కాగా, 2017లో డోక్లాం సరిహద్దులో చైనా రోడ్డు నిర్మిస్తున్న సమయంలో భారత్‌ అడ్డుకుంది. అప్పుడు ఇరు పక్షాల మధ్య ఘర్షణ నెలకొన్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ వ్యూహాత్మక పీఠభూమిలో భారత్‌ సరిహద్దువైపు చొచ్చుకురావడానికి చైనా ప్రయత్నిస్తోంది. దానిలో భాగంగా భూటాన్‌ భూగాన్ని ఆక్రమించి గ్రామాలు నిర్మిస్తూ తన ప్రజలను అక్కడకి తరలిస్తోంది.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*