
చీర ధరించి టెన్నిస్ ఆడి ఛాంపియన్ గా నిలిచిన భారతీయ వనిత
పర్వీన్ సుల్తానా
వంద సంవత్సరాల క్రితం టెన్నిస్ ఆడేవారు తెల్లటి స్కర్టులు మరియు టీ షర్టులతో ఆడినప్పుడు ఒక భారతీయ మహిళ తెల్లటి చీరను ధరించి టెన్నిస్ ఆడింది. ఆమె పేరు మెహెర్బాయి టాటా మరియు మెహెర్బాయి టాటా టెన్నిస్ లో అనేక విజయాలు సాధించినది.
పార్సీ స్టైల్లో చీర కట్టుకున్నప్పటికీ, మెహెర్బాయి కోర్టులో అద్భుతమైన చురుకుదనాన్ని ప్రదర్శించింది. భారతదేశంలోని వివిధ టోర్నమెంట్లలో మెహెర్బాయి 60కి తక్కువ కాకుండా బహుమతులు గెలుచుకుంది. మెహెర్బాయి 1924 పారిస్లో జరిగిన ఒలింపిక్ క్రీడలలో మహ్మద్ సలీమ్తో కలిసి మిక్స్డ్ డబుల్స్ పోటీలలో పాల్గొనేందుకు ఎంపికైంది. కానీ తెలియని కారణాల వల్ల ఈ జంట తమ ప్రత్యర్థులకు వాక్ ఓవర్ ఇచ్చింది.
మెహెర్బాయి అక్టోబర్ 10, 1879న బొంబాయిలో జన్మించింది. మెహెర్బాయి తండ్రి, హోర్ముస్జి J. భాభా, ఉన్నత విద్యను అభ్యసించడానికి ఇంగ్లాండ్కు వెళ్లిన మొదటి పార్సీలలో ఒకరు. మెహెర్బాయి కుటుంబం బెంగళూరుకు మారినప్పుడు, మెహెర్బాయి బెంగుళూరులోని బిషప్ కాటన్ పాఠశాలలో చదువుకుంది. అక్కడ మెహెర్బాయి, మెహ్రీ అనే పేరుతో ప్రసిద్ధి చెందింది.
1884లో మెహెర్బాయి తండ్రి మైసూర్లోని మహారాజా కళాశాల ప్రిన్సిపాల్గా నియమితులయ్యారు. మెహెర్బాయి లేదా మెహ్రీ ఇంగ్లీష్ మరియు లాటిన్ భాషలలో రాణించారు మరియు సైన్స్ తరగతులకు హాజరయ్యారు. మెహెర్బాయి 16 సంవత్సరాల వయస్సులో మెట్రిక్యులేషన్ లో ఉత్తీర్ణులైంది..
ఫిబ్రవరి 14, 1898న, మెహెర్బాయి టాటా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు జామ్సెట్జీ ఎన్. టాటా యొక్క పెద్ద కుమారుడు దొరాబ్జీ టాటాను వివాహం చేసుకుంది. దొరాబ్జీ టాటా తన నూతన వధువుకు 1900లో ప్రసిద్ధ 245.35 క్యారెట్ల జూబ్లీ డైమండ్ను బహుమతిగా ఇచ్చినందుకు ప్రసిద్ధి చెందారు, మెహెర్బాయి టాటా ముఖ్యమైన పబ్లిక్ ఫంక్షన్లకు హాజరైనప్పుడు దానిని గర్వంగా ధరించేది.
ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ (టిస్కో) కోసం నిధుల సేకరణ కోసం మెహెర్బాయి టాటా ఆ వజ్రాన్ని విక్రయించింది. మెహెర్బాయి టాటా నిస్వార్థతను టాటా కుటుంబ సభ్యులు ఎంతో మెచ్చుకున్నారు మరియు మెహెర్బాయి టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీల ఉద్యోగుల కృతజ్ఞత మరియు ఆప్యాయతను పొందారు.
మెహెర్బాయి టాటా భర్త దొరాబ్జీ టాటా కూడా పెద్ద క్రీడా ప్రేమికుడు మరియు భారత ఒలింపిక్ ఉద్యమం ఏర్పాటులో మార్గదర్శకుడు. 1920లో తొలిసారిగా ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనేందుకు భారత బృందానికి నిధులు సమకూర్చడంలో మరియు పంపడంలో దొరాబ్జీ టాటా కీలక పాత్ర పోషించాడు.
దొరాబ్జీ టాటా కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ విద్యార్థిగా ఉన్నప్పుడు, క్రికెట్లో రాణించాడు మరియు పార్సీ జింఖానా క్రికెట్ జట్టుకు కెప్టెన్ అయ్యాడు. ఇంగ్లండ్లోని భారత జింఖానా క్రికెట్ క్లబ్కు దొరాబ్జీ టాటా పోషకుడిగా ఉన్నాడు. దొరాబ్జీ టాటా భార్య మెహెర్బాయి టాటా 1923లో క్లబ్లో మొదటి మహిళా సభ్యురాలు అయ్యారు.
1910లో దొరాబ్జీ టాటా భారతదేశ పారిశ్రామిక అభివృద్ధికి చేసిన కృషికి బ్రిటిష్ చక్రవర్తి కింగ్ ఎడ్వర్డ్ VII చేత నైట్ బిరుదు పొందారు. ఆ తర్వాత, దొరాబ్జీ సర్ దొరాబ్జీ టాటా అయ్యాడు మరియు మెహ్రీని లేడీ మెహెర్బాయి టాటా అని పిలిచేవారు.
ప్రపంచమంతటా దొరాబ్జీటాటా తో తరచుగా చేసే ప్రయాణాలు మెహ్రీ ఎంతో ఆనందించారు. ఆటలు, ముఖ్యంగా టెన్నిస్, పట్ల మెహ్రీ ఆకర్షణను కలిగి ఉన్నారు. మెహ్రీ అనేక టోర్నమెంట్లలో ఆడింది మరియు 60కి పైగా బహుమతులను గెలుచుకుంది మరియు చాలా తరచుగా భార్యాభర్తల జంట మెహెర్బాయి మరియు దొరాబ్జీలు మిక్స్డ్ డబుల్స్ పోటీలలో భాగస్వామ్యలుగా పాల్గొనేవారు.
భారత జాతీయ దుస్తులు, చీర ధరించి మెహెర్బాయి ప్రేక్షకుల నుండి ప్రశంసలు మరియు ప్రేమను పొందింది.
1929లో, సర్దా చట్టంగా పిలువబడే బాల్య వివాహ నిరోధక చట్టం, అమలులోకి వచ్చింది. దీనికి గాను లేడీ మెహెర్బాయి టాటాతో సహా భారతదేశంలోని అనేక మహిళా ఉద్యమ మార్గదర్శకులకు క్రెడిట్ వెళ్తుంది. లేడీ మెహెర్బాయి భారతదేశం మరియు విదేశాలలో బాల్య వివాహ నిరోధక చట్టం కోసం చురుకుగా ప్రచారం చేసింది.
మధ్యవయస్సులో లేడీ మెహెర్బాయి టాటాకు లుకేమియా ఉన్నట్లు నిర్ధారణ అయింది మరియు నార్త్ వేల్స్లోని రూథిన్లోని ఒక నర్సింగ్హోమ్లో చేరింది, అక్కడ లేడీ మెహెర్బాయి టాటా జూన్ 18, 1931న మరణించింది. ఒక సంవత్సరం తర్వాత, సర్ దొరాబ్జీ టాటా తన భార్య మెహెర్బాయి టాటా జ్ఞాపకార్థం లేడీ టాటా మెమోరియల్ ట్రస్ట్ను స్థాపించారు. .
ల్యుకేమియాపై ప్రత్యేక దృష్టి సారించి, రక్త సంబంధిత వ్యాధులలో శాస్త్రీయ పరిశోధనలకు లేడీ టాటా మెమోరియల్ ట్రస్ట్ నిధులు సమకూరుస్తుంది.
Be the first to comment