ఏపిలో పలువురు ఐఏఎస్ లకు పదోన్నతి

ఏపిలో పలువురు ఐఏఎస్ లకు పదోన్నతి

▪️సీనియర్ ఐఏఎస్ అధికారులు సురేష్ కుమార్, సాల్మన్ ఆరోక్యరాజ్ లకు పదోన్నతి కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
▪️2000 బ్యాచ్ కి చెందిన ఈ ఇద్దరు అధికారులకు ముఖ్య కార్యదర్శి హోదా కల్పిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
▪️పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖ ముఖ్యకార్యదర్శిగా సురేష్ కుమార్ ను రీడిజిగ్నేట్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
▪️సాల్మన్ ఆరోక్యరాజ్ ప్రస్తుతం డిప్యుటేషన్ పై కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారు.
▪️2009 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారులు కార్తికేయ మిశ్రా, వీరపాండ్యన్, సీహెచ్ శ్రీధర్లకు కార్యదర్శి హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
▪️ప్రస్తుతం సీఎంవోలో సహాయ కార్యదర్శిగా ఉన్న కార్తికేయ మిశ్రాకు అక్కడే సీఎంవో కార్యదర్శిగా పదోన్నతి కల్పించారు.
▪️వీరపాండ్యన్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈవోగా కొనసాగనున్నారు.
▪️కడప జిల్లా కలెక్టర్ గానే శ్రీధర్ ను కొనసాగిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.
▪️ఐపీఎస్ అధికారులు విక్రాంత్ పాటిల్, సిద్ధార్థ్ కౌశల్ కు పదోన్నతి కల్పించారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*