
ఏపీలో పింఛన్ల తనిఖీ డిసెంబర్ 9, 10
పైలట్ ప్రాజెక్ట్ గా రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల తనిఖీలు జరుగుతాయి!
ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల తనిఖీని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది..
గత ప్రభుత్వం హయాంలో దివ్యాంగులు, ఇతర కేటగిరీల్లో అనర్హులు లబ్ధి పొందుతున్నారని ఫిర్యాదులు రావడంతో ఏపి సర్కార్ చర్యలకు సిద్ధమైంది…
తొలి విడతలో ఒక్కో గ్రామ, వార్డు సచివాలయ పరిధిలోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సోమవారం, మంగళవారం అధికారులు వివరాలు సేకరించనున్నారు.
ఇందుకోసం పక్క మండలానికి చెందిన సిబ్బందిని ప్రభుత్వం నియమించనుంది.
ఒక్కో బృందం 40 మంది పింఛన్లను పరిశీలిస్తుంది!
Be the first to comment