వన భోజన మహోత్సవంలో పాల్గొన్న శ్రీ యల్లటూరు శ్రీనివాస రాజు

వన భోజన మహోత్సవంలో పాల్గొన్న శ్రీ యల్లటూరు శ్రీనివాస రాజు

ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం రాజంపేట పట్టణం నందు ఉన్న మన్నూరు గ్రామంలో నాగలకట్ట దగ్గర ప్రతి సంవత్సరము ఎంతో ఘనంగా కార్తీకమాసంలో “వనభోజన మహోత్సవం” నిర్వహిస్తారు. అదే విధంగా ఈ రోజు మన్నూరు గ్రామ ప్రజలు మరియు నాగలకట్ట సేవా సమితి ఆద్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ సమన్వయకర్త “శ్రీ యల్లటూరు శ్రీనివాస రాజు” గారు పాల్గొని ముందుగా నాగలకట్ట దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు ఏర్పాటు చేసిన అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, జనసేన నాయకులు మరియు గ్రామ ప్రజలు , మహిళలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*