
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో విశాఖ డైరీ అవినీతి విచారణకు ప్రత్యేక హౌస్ కమిటీ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు విశాఖ డైరీ అవినీతి, అక్రమాలపై విచారణ కోసం ప్రత్యేక హౌస్ కమిటీని నియమించారు. నవంబర్ 20న శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించడంతో ఈ కమిటీ ఏర్పాటుకు అడుగు పడినట్లు స్పీకర్ తెలిపారు.
కమిటీ చైర్మన్: జ్యోతుల నెహ్రూ గారు ,
కమిటీ సభ్యులు: బొండ ఉమామహేశ్వరరావు గారు , వెలగపూడి రామకృష్ణ బాబు గారు, పళ్లా శ్రీనివాసరావు గారు, గౌతు శిరీష గారు, ఆర్.వి.ఎస్.కే.కె. రంగా రావు గారు, దాట్ల సుబ్బరాజు గార్లను నియమించారు. కమిటీ సమగ్ర విచారణ జరిపి, రెండు నెలల లోపు విచారణ పూర్తి చేసి నివేదికను సమర్పించాల్సిందిగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారు ఆదేశించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఇది ఒక కీలక అడుగుగా ఆయన అభిప్రాయపడ్డారు.
Be the first to comment