డబ్బై సంవత్సరాల చరిత్రను తిరగరాసిన పవన్ కళ్యాణ్:
గడచిన డబ్బై సంవత్సరాల ఆంధ్ర రాజకీయ చరిత్రలో నేటి వరకు 21 మంది ముఖ్యమంత్రులు వచ్చి పోయారు.
సుమారు ఒక తొంబై లక్షల కోట్లు బడ్జెట్ రూపంలో ఖర్చు పెట్టీ ఉంటారు
ఈ 21 ముఖ్యమంత్రులు పేషీల నిర్వహణకు కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టీ వుంటారు.
కొన్ని వేల కోట్ల భూములను వివిధ ప్రైవేట్ వ్యక్తులకు సంస్థలకు ధారాదత్తం చేసి ఉంటారు
55 గిరిజన గ్రామాలకు కేవలం 30 అంటే 30 కోట్ల రూపాయిలను కేటాయించలేక పోయారు. రోడ్లు వేపించలేక పోయారు.
గడచిన 70 సంవత్సరాలలో గిరిజన డోలీలు టీవీ చర్చలకు, అసెంబ్లీ డిబేట్ లకు మాత్రమే ఉపయోగపడ్డాయి. కానీ డోలీలలో మగ్గిపోయిన గిరిజనులకు ఉపయగపడలేదు.
ఒక్క మగాడు…పవన్ కళ్యాణ్
డిప్యూటీ సిఎం అని చెప్పు కోవడానికే భయపడే రోజుల్లో పవన్ కళ్యాణ్ అనే ఒక మహా శక్తి డిప్యూటీ సిఎం గా అయ్యాడు.
30 కోట్లను కేటాయించి 55 గ్రామాలకు 30 కిలోమీటర్ల రోడ్డు సదుపాయం కల్పించాడు. గిరిజనుల జీవితాల్లో మనకీ ఒక ప్రభుత్వం ఉంది అనే ఒక చిన్న భరోసాను పవన్ కళ్యాణ్ ఆ గిరిజనుల్లో కల్పించాడు.
ఇదే పవన్ కళ్యాణ్ రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్న రెడ్డి కమ్మ కులాల్లో పుట్టి ఉంటే ఈపాటికే మీడియాలో పవన్ కళ్యాణ్ పేరు మారు మొగిపోయేది. సమస్త జాతులు చేతులు జోడించి దండాలు పెట్టడం మొదలు పెట్టి ఉండేవారు.
ఇది ఏమైనప్పటికీ 55 గిరిజన గ్రామాలకు ఏడు దశాబ్దాల అనంతరం రోడ్డు వేపిస్తున్నా జనసేనాని పవన్ కళ్యాణ్ శతమానం భవతి శాతాయుష్ మాన్ భవ.
ఈ విషయం లో పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలియజేయాలి
మీ ఈ గొప్పతనం రేపటి భావితరాలకు ఆదర్శవంతమైన నీ జీవిత చరిత్ర ఆధిపత్య కుల మీడియాలో లోపలి పేజీలకే పరిమితం కావచ్చు. కానీ సమస్త గిరిజనుల గుండెల్లో మాత్రం నీవు ఎప్పటికీ నిలిచి పోతావు..
పవన్ కళ్యాణ్ ద్వారానే మార్పు వస్తుంది అనే వారి లక్ష్యంలో సమ్మిళితమై ఉంటాడు…
పవన్ కళ్యాణ్ నాకేమీ చేశాడు. నా పార్టీకి ఏమీ చేశాడు అనే సోదరులారా! పవన్ కళ్యాణ్ అనే శక్తి మారుమూల గిరిజనులకు కూడా అధికార ఫలాలను ఎలా చెరుస్తున్నాడో ఒక్కసారి ఆలోచించండి రాజకీయ నాయకులు ఇకనైనా ప్రజల కు ఎలా మంచిచేయాలి ఆలోచించండి…
మల్లెల శివ నాగేశ్వరావు
నేషనల్ ప్రెసిడెంట్
కేసరి ఆక్టివ్ ప్రెస్ అసోసియేషన్


Be the first to comment