ఆధార్ సేవలు ప్రతి పేద వారికి అందుబాటులో సిఎం చంద్రబాబు నాయుడి హుకూం
అధిక ధరలు వసూలు చేస్తున్న ఆధార్ సెంటర్ నిర్వహకులకు ముక్కుతాడు పడినట్లేనా?
సిఎం చంద్రబాబు నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామ మరియు పట్టణాలకు చెందిన ప్రజలు
ఆధార్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.
ప్రజలు సులభంగా ఆధార్ సేవలు వినియోగించుకునేలా వెయ్యి ఆధార్ కిట్ల కొనుగోలుకు రూ.20 కోట్లు మంజూరు చేస్తూ సిఎం చంద్రబాబు నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు.
వీలైనంత త్వరగా గ్రామ-వార్డు సచివాలయాల్లో వెయ్యి ఆధార్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.
అటు జనన-మరణ ధ్రువ పత్రాలు పొందేందుకు సచివాలయాలలోనే JAN 1న కొత్త వెబ్సైటును ప్రారంభించాలన్నారు.


Be the first to comment