మనుషులే కాదు… జంతువులు కూడా వాటి కోరికలు కోసం దేవుడిని వేడుకుంటాయి..
అలాంటి దృశ్యం….కెమెరా కళ్ళకు చిక్కింది…
శివలింగానికి ఓ శివయ్య నా మాట వినయ్యా…. అని మొక్కుతున్న వానరం
మేడ్చల్
మల్కాజిగిరి జిల్లా
కీసరగుట్టలో రామలింగేశ్వరస్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న శివలింగానికి ఓ వానరం మొక్కింది.
సోమవారం స్వామి దర్శనానంతరం భక్తులు ఆలయానికి ఎదురుగా ఉన్న శివలింగాలకు పూజలు చేసి అలంకరించారు.
ఆ సమయంలో ఓ కోతి తన్మయత్వంతో శివలింగానికి మొక్కడం భక్తులను ఆకర్షించింది.
పక్కనే కొబ్బరి చిప్పలున్నా కోతి చేష్టలు చేయకుండా దండంపెడుతున్న ఈ ఆసక్తికర దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది


Be the first to comment