డి జి పి ద్వారకా తిరుమలరావు కు పులివెందుల శాసనసభ్యులు వైయస్ జగన్ బహిరంగ క్షమాపణ చెప్పాలి.
డి జి పి ద్వారకా తిరుమలరావు కు పులివెందుల శాసనసభ్యులు వైయస్ జగన్ బహిరంగ క్షమాపణ చెప్పాలి. సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వేల్పురి శ్రీనివాసరావు డిమాండ్. వైయస్ షర్మిల వైయస్ రాజశేఖరరెడ్డి కి పుట్టలేదు అని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వైయస్ భారతి రెడ్డి కి సహాయకుడు గా ఉన్న పులివెందుల కు చెందిన వర్రె రవీంద్రారెడ్డి ని కడప జిల్లా పోలీసులు అరెస్టు చేసిన వెంటనే ఆంద్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు ద్వారకా తిరుమలరావు ను, తిరుపతి యస్ .పి . సుబ్బా రాయుడు ను సప్త సముద్రములు దాటినా మిమ్ములను వదలను అని జగన్ బ్లాక్ మెయిల్ చేయడం సిగ్గుచేటని, పోలీసు వ్యవస్థను అవమానానికి గురి చేసిన జగన్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వేల్పురి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. నిజాయితీగా, సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు ను బిసి సామాజిక వర్గానికి చెందిన ద్వారక తిరుమలరావు ను, కాపు సామాజిక వర్గానికి చెందిన సుబ్బారాయుడు ను కించ పరిచిన నిన్ను రాజకీయ సమాధి చేస్తామని శ్రీనివాసరావు హెచ్చరించారు . జగన్ పాలన లో పోలీస్ అధికారులు ను కిడ్నాప్ చేయడానికి ఉపయోగించి, కేసులు నమోదు , సస్పెండ్ అయ్యారు అని, కొందరు జైలు శిక్ష అనుభవిస్తున్నారు అని పేర్కొన్నారు. సిఎం చంద్ర బాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల మీద తప్పుడు ప్రచారం చేసిన 307 కేసులు ఉన్న గుంటూరు జిల్లా జగన్ సోషల్ మీడియా హెడ్ వెంకటరెడ్డి ని అరెస్ట్ చేయడం అన్యాయం అని జగన్ చెప్పడం, జగన్ లో ఉన్న నేర చరిత్ర బయటపడింది అని శ్రీనివాసరావు చెప్పారు. రాష్ట్రంలో కులాలు మద్య చిచ్చు పెట్టడానికి లక్ష మంది సైకో సోషల్ మీడియా ముఠా ను ఏర్పాటు చేసిన జగన్ ను అరెస్ట్ చేయాలని సిఎం చంద్ర బాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లకు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. సిఎం గా ఉన్న మర్రి చెన్నారెడ్డి ని తొలగించాలని , వైయస్ రాజశేఖర రెడ్డి సిఎం పదవి కోసం హైదరాబాదు లో హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టి 400 మంది మరణానికి కారణం అయ్యారు అని శ్రీనివాసరావు గుర్తుచేశారు.


Be the first to comment