పేదల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు లో విఫలం అవుతున్నాయి
పేదల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు లో విఫలం అవుతున్నాయి. అందులో ముఖ్యం అయింది. జాతీయ ఆహార భద్రత చట్టం. పేదల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బియ్యం అక్రమ రవాణా చేస్తూ కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు తరలించు తున్నారు. ఆరోగ్యానికి మంచి బియ్యం అమ్ముకొని రోగాలు తెచ్చే సన్న బియ్యం ప్రజలు తింటు న్నారు. కొందరు వ్యాపారులు ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బియ్యం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యం కోసం విటమిన్ బియ్యం కలపి రేషన్ ఉచితం గా ఇస్తున్నారు. కొందరు దేశ ద్రోహులు రైస్ మిల్లుల ముసుగులో పేదల బియ్యం కొనుగోలు చేసి కాకినాడ పోర్టు కి అమ్ముతున్నారు. ఈ దోపిడీ గత 20 ఏళ్లుగా సాగుతుంది. టిడిపి, ycp నాయకులు pds రైస్ మాఫియా పై మౌనం గా ఉంటూ నామా మాత్రం చర్యల తో ప్రజలను నమ్మించి మోసం చేశారు. రెవెన్యూ అధికారులు, నిఘా అధికారులు, పోలీస్ వ్యవస్థ, సివిల్ సప్లై అధికారులు pds రైస్ మాఫియా ను రాజకీయ నాయకులు అండతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. Pds రైస్ మాఫియా దేశం లో పెద్ద మాఫియా. కాకినాడ పోర్టు నుంచి పేదల బియ్యం అక్రమ రవాణా ద్వారా కోట్లాది రూపాయలు లంచాలు తీసుకుంటున్నారు.


Be the first to comment