నేడు టీచర్ MLC ఓట్ల కౌంటింగ్
AP: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ MLC ఉపఎన్నిక ఫలితాలు నేడు వెలువడనున్నాయి. కాకినాడ జేఎన్టీయూలో 14 రౌండ్స్లో 9 టేబుల్స్పై అధికారులు ఉదయం 8 నుంచి ఓట్లను లెక్కించనున్నారు. టీచర్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక బరిలో ఐదుగురు అభ్యర్థులు నిలిచిన విషయం తెలిసిందే. డిసెంబర్ 5న ఓటింగ్ జరగ్గా, 15,490 మంది ఓటేశారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో స్పష్టమైన మెజారిటీ రాకపోతే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.


Be the first to comment