శివ భక్తులకు అల్పాహారం మజ్జిగ పంపిణీ
పెదకాకాని శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానమునకు కార్తీక మాసం ఆఖరి వారం సందర్భంగా శివ భక్తులకు పెదకాకాని జనసేన పార్టీ గ్రామ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవాసమితి మండల అధ్యక్షులు తిరుమల శెట్టి మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో అల్పాహారం, మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమ ముఖ్య అతిథిగా జనసేన పార్టీ మహిళా విభాగం రీజినల్ కో-ఆర్డినేటర్. వచ్చారు ఈ సందర్భంగా మనోజ్ కుమార్ మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుంచి శివ భక్తులు భక్తి శబ్దాలతో ఉపవాసాలు ఉంటారని. కార్తీక మాసంలో ఆఖరి వారం సందర్భంగా పెద్ద సంఖ్యలో క్యూలైన్లో భక్తులు నిలబడి ఉంటారని. భక్తులకు ఎలాంటి అలసట కలగకుండా అల్పాహారం మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు వీరేళ్ల వెంకటేశ్వరరావు గారు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.


Be the first to comment