మహిళలకు సీఎం యోగి గిఫ్ట్ : డబుల్ డెక్కర్ బస్సులో ఉచిత ప్రయాణం..!! లక్నో : ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉత్తర ప్రదేశ్ మహిళలకు గుడ్ న్యూస్ తెలిపారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సు సర్వీసుల్లో మహిళలు సగం ధరకే ప్రయాణించే అవకాశం కల్పించారు. డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులను సీఎం యోగి ప్రారంభించారు. ఈ సర్వీసుల్లో ప్రయాణించే మహిళలకు టికెట్లపై 50 శాతం తగ్గింపును ప్రకటించారు. ఈ ప్రకటనతో సభా ప్రాంగణం చప్పట్లతో మారుమోగింది. అంతేకాకుండా ప్రతి శనివారం ఉదయం హెరిటేజ్ మార్గంలో నడిచే బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు


Be the first to comment