తిరుపతివాసులకు శ్రీవారి దర్శనం.. హర్పణీయం
తితిదే బోర్డుకు పవన్ కల్యాణ్ తిరుపతి ప్రజ లకు ప్రతీ నెలా మొదటి మంగళవారం తిరుమలేశుడి దర్శనం కల్పిస్తామని తితిదే బోర్డు తీసుకున్న నిర్ణయం హర్షణీయమని ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ పేర్కొన్నారు. తితిదే పాలకమండలి తొలి సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఛైర్మన్ బీఆర్ నాయుడు, బోర్డు సభ్యులకు, ఈవో శ్యామలరావుకు సోమవారం ఓ ప్రకటనలో అభినందనలు తెలిపారు. ఎన్నికల ప్రచార సమయంలో తిరుపతి నగర ప్రజలు ఈ విషయాన్ని నా దృష్టికి తెచ్చారు. కూటమి ప్రభుత్వం మీ హామీని నెరవేరుస్తుందని భరోసా ఇచ్చాను. నగర ప్రజలఆకాంక్షను తితిదే ఛైర్మన్, ఈవో దృష్టికి తీసుకువెళ్లి పరిశీలించాలని సూచించాను. అని పవన్ పేర్కొన్నారు.


Be the first to comment