అంతర్జాతీయ మిస్టర్, మిస్ వరల్డ్ ప్రో షో బాడీ బిల్డింగ్ లో నిశంకర రవికుమార్ బంగారు పతకం
భారత జట్టుకు ప్రాతినిత్యం వహించిన నిశంకర రవికుమార్ 65 – 70 కేజీల కేటగిరి బాడీ బిల్డింగ్ పోటీలో సుమారు 450 మంది ఈ పోటీలో పాల్గొన్నారు, గుంటూరు ఏటుకూరు కు చెందిన ఆణిముత్యం నిశంకర రవికుమార్ పసిడి పతాకాన్ని కైవసం చేసుకున్నాడు. ఏ.టి. అగ్రహారం శ్రీ విజేత హైస్కూల్ లో డైరెక్టర్ చెరుకూరి శ్రీహరి గారు సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ ఉపా అధ్యక్షులు అడపా మాణిక్యాలరావు గారు పారిశ్రామికవేత షేక్ షబ్బీర్ గారు 31వ డివిజన్ అధ్యక్షులు మధులాల్ గారు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు దాసరి శ్రీనివాస్ గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబోతుల శివ గారు పాల్గొని నిశంకర రవికుమార్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ మరెన్నో సువర్ణ పతకాలు సాధించాలని కోరుకోవటం జరిగినది.


Be the first to comment