యుద్ధం పై స్పందించిన 43 వ వార్డు కార్పొరేటర్
పెద్దిశేట్టి ఉష శ్రీ:
పాకిస్తాన్ కుయుక్తులకు చెక్ పెట్టేలా మన దేశం ప్రారంభించిన సైనిక చర్య ఆ దేశానికి మరో గుణపాఠం చెప్పనుంది. పహల్గాంలో అమాయక టూరిస్టులను పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్ ప్రేరేపిత టెర్రరిస్టులకు బుద్ధి చెప్పడం మన తక్షణ కర్తవ్యం. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా పాక్, పీఓకే లోని 9 ప్రాంతాలపై దాడులు చేసి పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించిన మన జవానులకు హ్యాట్సాప్. దేశ ప్రజానీకానికి నిరంతరం రక్షణగా నిలిచే సైనిక సోదరులకు… దేశాన్ని ఏకతాటిపై నడిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి,కొనిదాల పవన్ కళ్యాణ్ గారికి యావత్ భారతదేశం మద్దతుగా నిలబడుతుంది. ఉగ్ర మూకలకు. వాటిని నడిపిస్తున్న పాకిస్తాన్ కు 1965, 1971 సహా 1999 కార్గిల్ యుద్ధాలకు మించిన చావు దెబ్బ సిద్ధంగా ఉంది అంటూ పెద్దిశెట్టి ఉష శ్రీ ఈ సందర్భంగా తెలిపారు


Be the first to comment