అల్లూరి సీతారామరాజు జిల్లాలో రూ.105 కోట్ల వ్యయంతో చేపట్టిన రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు
అల్లూరి సీతారామరాజు జిల్లాలో రూ.105 కోట్ల వ్యయంతో చేపట్టిన రహదారి నిర్మాణ పనులకు బల్లగరువులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. అనంతరం, వైద్య ఆరోగ్యశాఖ, ఐసీడీఎస్ ప్రాజెక్టు, పంచాయతీరాజ్, వన్ ధన్ వికాస్ స్టాల్స్ను సందర్శించి అక్కడి ప్రదర్శనలను పరిశీలించారు. వన్ ధన్ వికాస్ స్టాల్స్లో ప్రదర్శించిన అటవీ ఉత్పత్తులను పవన్ కళ్యాణ్ స్వయంగా కొనుగోలు చేసి ఆదరణను చూపించారు.


Be the first to comment