దీపం-2 పథకంలో 80.37 లక్షల సిలిండర్ల బుకింగ్‌

దీపం-2 పథకంలో 80.37 లక్షల సిలిండర్ల బుకింగ్‌

దీపం-2 పథకంలో 80.37 లక్షల సిలిండర్ల బుకింగ్‌
ఆంధ్రప్రదేశ్ : దీపం-2 పథకంలో 80.37 లక్షల ఉచిత సిలిండర్లు బుక్‌ చేసుకున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. ఇందులో 62.30 లక్షల సిలిండర్లు డెలివరీ చేశామని, వారి ఖాతాల్లో రూ.463.82 కోట్లు జమ చేశామని వివరించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. బుక్ చేసుకున్న వెంటనే పట్టణ ప్రాంతాల్లో 24 గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో 48 గంటల్లో సిలిండర్ డెలివరీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం 48 గంటల్లో రాయితీ సొమ్ము జమ చేస్తున్నట్లు తెలిపారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*