కొడంగల్ లగచర్ల గ్రామ గిరిజన లంబాడి బిడ్డలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూన సేవాలాల్

కొడంగల్ లగచర్ల గ్రామ గిరిజన లంబాడి బిడ్డలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూన సేవాలాల్ బంజారా సంఘం జనసేన పార్టీ ఇంచార్జ్.. చందు నాయక్

దేవరకొండ నియోజకవర్గం సేవాలాల్ బంజారా సంఘం కార్యాలయంలో ఒక ప్రకటన విడుదల చేస్తూ కొడంగల్ లగచర్ల గ్రామ ఫార్మా కంపెనీ కోసం గిరిజన లంబాడి బిడ్డల భూములను అక్రమంగా వారి దగ్గర నుండి లాక్కొని చిత్ర హింసలు గురి చేస్తూ మనోభావాలను దెబ్బతీస్తూ విరుచుకు పడడం అమాయక లంబాడి బిడ్డలపై పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి తీవ్రంగా కొట్టడం మా గిరిజన లంబాడి జాతి మనసు కలిసి వేస్తుంది ప్రభుత్వ హేయమైన చర్యకు నిదర్శనమిస్తుంది అని సేవాలాల్ బంజారా సంఘం జనసేన పార్టీ ఇంచార్జ్ చందు నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే అక్కడ జరిగిన పరిణామాల గురించి పోలీస్ వ్యవస్థ తప్పు చేసినవారికి అధికారులకు వ్యతిరేకంగా వెళ్లిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు తప్పు చేసిన వారిని వదిలిపెట్టి అమాయక ప్రజల పైన ప్రతాపం చూపడం మానుకోవాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసిన వారికి వెంటనే విడుదల చేయాలని లేనియెడల గిరిజన లంబాడీలు ప్రతి ఒక్కరు వచ్చి సచివాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*